Home / Latest Alajadi / ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కన్నుమూత.

ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కన్నుమూత.

Author:

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) చెన్నైలోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కచేరీలు చేసి ఎన్నో అవార్డులు రివార్డులతోపాటు డాక్టరేట్లను, ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్న మంగళంపల్లికి భారతప్రభుత్వం పద్మభూషణ్,పద్మ విభూషణ్, పద్మశ్రీ పురస్కారంలతో సత్కరించింది….. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. 1930జులై  6 వ తేదీన తూర్పుగోదవరి జిల్లా శంకరగుప్తంలో పట్టాభిరామయ్య, సూర్యకాంతం దంపతులకు జన్మించిన మంగళంపల్లి ఆరేళ్ళ వయసులోనే గాయకుడిగా సంగీత ప్రస్థానం ప్రారంబించాడు. మొదటి గురువు వారి తండ్రే కావడం విశేషం. సంగీతంతో పాటు మృదంగం, మురళి, వీణ,వయోలిన్ వంటి వాటిలో మంచి పట్టుసాధించారు. చాలా రోజుల పాటు తితిదే,శృంగేరి పీఠాల ఆస్థాన విద్వంసుడిగా పనిచేశారు. చాలా సినిమాలలో పాటలు పాడారు, భక్త ప్రహ్లాద సినిమాలో నారదునిగా, మరికొన్ని సినిమాలలో నటించారు. అయన ఎన్నో అవార్డులతో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.

mangalampalli-balamuralikrishna

గత కొంత కాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చాలా రోజులపాటు చెన్నైలోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది కొద్దీ రోజుల క్రితమే ఇంటికి వచ్చారు . ఇంటికి వచ్చిన కొద్దీ రోజులకే ఆరోగ్యం విషమించింది. చెన్నైలోని తన అకాడమీలో కుటుంబ సభ్యులతో పాటు శిష్యులు కూడా సేవ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు.

(Visited 591 times, 1 visits today)