తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా రూపొందిన ‘వేదాళం’ సినిమా ప్రస్తుతం తమిళ బాక్సాఫీస్ వద్ద సంచలన ఓపెనింగ్స్ రాబట్టి దూసుకుపోతోంది. ఈ ఏడాది తమిళంలో భారీ అంచనాలతో విడుదలవుతోన్న సినిమాల్లో ఒకటిగా చెప్పబడుతూ వచ్చిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమా మొదటిరోజు ఏకంగా 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని తమిళ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తమిళంలో ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో ఇదే రికార్డు ఓపెనింగ్గా తెలుస్తోంది. గోపీచంద్తో గతంలో ‘శౌర్యం’ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించిన శివ వేదాళం సినిమాకు దర్శకత్వం వహించారు. ఏ.ఎ. రత్నం నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించారు. త్వరలోనే ఈ సినిమా ‘ఆవేశం’ పేరుతో తెలుగులోనూ విడుదల కానున్నది కానీ ఇప్పుడు ఈ సినిమా పై చిరంజీవి కన్ను పడిందని అంటూన్నారు..
చిరంజీవి 150వ సినిమా కోసం చాలా రోజులనుండి చూస్తున్నారు కానీ ఏది సెట్ కావడం లేదు దానితో ఇప్పుడు అజిత్ సినిమా కోసం ఈ సినిమా ప్రోడ్యుసర్ ఏ.ఎం .రత్నంతో మాట్లడుతున్నట్టు వినికిడి. ఐతే అంతకు ముందు విజయ్ కత్తి సినిమా రీమేక్ చెయ్యలన్న ఆలోచన ఉన్నట్టు తేలియ జేశారు కాని ఈ రెండు సినిమాలల్లో ఏదో ఒక్కటి మాత్రం కచ్చితంగ చేయ్యలని అనుకుంటున్నాట్టు అలాగే చరణ్ గౌందమని అనే తమిల్ సినిమా హక్కులను కొన్నట్టు తేలియజేశాడు .కానీ ఈ సినిమా తన సోంత సంస్థ వైట్ హర్స్ సంస్థ పై చిన్న హీరోలతో నిర్మిస్తున్నట్టు తేలుస్తుంది.