ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి ఏటూరునాగారం దండకారణ్యంలోని మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతరకి భక్తులు పోటెత్తుతున్నారు, ఈ సంవత్సరంలో మేడారం జాతర జనవరి 31 న మొదలై ఫిబ్రవరి 3 తేదీ వరకు జాతర కొనసాగుతుంది. జాతర మొదలవకముందే లక్షల మంది భక్తులు మేడారం జాతరకు బయలుదేరారు. ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది, కోట్లమంది భక్తులు సందర్శించే మేడారం జఠరని జాతీయ పండుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది, ఈ జాతరకి స్పెషల్ గా రైళ్లు, బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
మేడారం జాతర సందర్భంగా Mic Tv వారు చేసిన మేడారం సమ్మక్క సారక్క పాట అందరిని ఆకట్టుకుంటుంది, జాతర జరిగే తీరుని, జాతర గొప్పతనాన్ని, అడివిబిడ్డల సంప్రదాయాలని పాట రూపంలో చాలా బాగా చెప్పారు, ఇంత అద్భుతమైన పాటని కందికొండ గారు రాశారు.