Home / Entertainment / నారా రోహిత్ తో మిస్ ఇండియా ఫైనలిస్ట్ ని ఫైనలైజ్ చేసారు.

నారా రోహిత్ తో మిస్ ఇండియా ఫైనలిస్ట్ ని ఫైనలైజ్ చేసారు.

Author:

Tanya Hope Photos

నారా రోహిత్ ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలను లైన్ లో పెట్టి, మరో రెండు సినిమాలను సెట్స్ పై ఉంచడమే కాకుండా తుంటరి అనే సినిమా సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసి రిలీజ్ కి సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం నారా రోహిత్ పండగలా వచ్చాడు,శంకర, సావిత్రి, రాజా చేయ్యివేస్తే,మద్రసి సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో నారా రోహిత్ తో పీరియడ్ థ్రిల్లర్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా కోసం మిస్ కోల్ కతా మరియు 2015 మిస్ ఇండియా ఫైనలిస్ట్ లో ఒకరైన తన్య హోప్ ని హీరోయిన్ గ ఫైనలైజ్ చేసారు. ఇటీవలే ఫోటోషూట్ జరిపి ఈ సినిమాకి తనే పర్ఫెక్ట్ అని తన్య హోప్ ని ఫైనలైజ్ చేసారు. 1992 – 96 లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలను ఆధారం చేసుకొని, ఒకరి క్రైమ్ బయోగ్రఫీ మీద అప్పట్లో ఒకడుండేవాడు సినిమాని తీయనున్నారు. తనయ హోప్ ఓ ముఖ్య పాత్రలో నటించిన రామ్ ‘నేను శైలజ’ సినిమా జనవరి 1న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

(Visited 354 times, 1 visits today)