కలెక్షన్ కింగ్, పద్మశ్రీ డా. మోహన్ బాబు నటుడిగా చిత్ర సీమకి పరిచయమై 40 వసంతాలు పూర్తి చేసుకున్నాడు.‘నా కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ కష్టాలను ఎదుర్కొని 40 ఏళ్ళ కెరీర్ ని పూర్తి చేసుకొని సుమారు 560 సినిమాలలో నటించాను. 40 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఆయన హీరోగా మంచు విష్ణు నిర్మించిన సినిమా ‘మామ మంచు అల్లుడు కంచు’. ఈ సినిమాలో అల్లరి నరేష్ మరో హీరోగా కనిపించనున్నాడు. ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ నిన్న సాయంత్రం తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మోహన్ బాబు తన బాధ్యతలను తన వారసులైన విష్ణు, మనోజ్, లక్ష్మీలకు అప్పగించినట్లు తెలిపాడు.
నా పిల్లలని సెటిల్ చెయ్యాలని నేను సినిమాలు చేయడం తగ్గించాను. ఇకపై నా బాధ్యతలన్నిటినీ విష్ణు, మనోజ్, లక్ష్మీలకు అప్పగిస్తున్నాను. మామ మంచు అల్లుడు కంచు తర్వాత నుంచి ప్రతి ఏడాది ఒక్క సినిమా అన్న చేయదలచుకున్నానని’ మోహన్ బాబు తెలిపారు. ఈ సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.