ఊపిరి అక్కినేని నాగార్జున, తమిళ నటుడు కార్తీల కలయికలో వస్తున్న సినిమా. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్
షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. బ్యానర్ పై రూపొందుతున్న ఊపిరి సినిమా కోసం ఇటీవలే విదేశాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. నాగార్జున కార్తీ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రం మంచి టాక్ నే సంపాదించుకుంటోంది.
ఊపిరి మోషన్ పోస్టర్ విడుదల సంధర్బంగా ”ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ వినలేదు. వంశీ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యా.
మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది.” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఇదే విషయం పై కార్తి కూడా ”నా సినిమాలన్నీ తెలుగులో అనువాద రూపంలో విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. నాగార్జున గారితో తెర పంచుకోవడం ఆనందంగా ఉందంటూ ట్విట్టర్ లో తెలిపారు.