అధిక బరువు ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తున్న సమస్య, అధిక బరువు ఉన్నవారికి కలిగే అసౌకర్యాల్లో ముందుకు తన్నుకొచ్చిన పొట్ట కూడా ఒకటి. భారీగా పెరిగిన పొట్టని తగ్గించుకోవడం కోసం అనేక మంది తమకు తెలిసిన పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు, వివిధ ప్రయత్నాలు చేసి అనేక కొత్త కొత్త రోగాలని తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు, కానీ సహజ పద్దతిలో ప్రయత్నిస్తే చాలా సులభంగా పొట్టని తగ్గించుకోవచ్చు, కింద ఇచ్చిన ఓ చిట్కాను పాటిస్తే సరి. కొద్ది రోజుల్లోనే పొట్టను సులభంగా తగ్గించుకోవచ్చు.
చాలా మందికి ఉదయం లేచిన వెంటనే తేనే, నిమ్మకాయ రసంతో చేసిన జ్యూస్ ని తాగే అలవాటు ఉంటుంది, అలా తాగడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, సహజంగా బరువు, పొట్టని తగ్గించుకోవాలని అనుకునే వారు తేనే కలిపిన నిమ్మరసంలో కొద్దిగా కొత్తిమీర ఆకులని వేసుకొని తాగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి, కొత్తిమీర ఆకులని కలుపుకొని ప్రతిరోజూ తాగడం వల్ల వారం రోజులలోనే మార్పు కనిపిస్తుంది,చాలా తక్కువ రోజులలోనే పెరిగిన పొట్టని పూర్తిగా తగ్గించుకోవచ్చు, ఈ చిట్కాని సహజ వైద్యంలో చాలా విరివిగా ఉపయోగిస్తారు.
ఈ చిట్కాకి కావాల్సిన పదార్థాలు:
తయారు చేసే విధానం:
మొదటగా కొత్తిమీర ఆకులని మొత్తగా రుబ్బాలి, ఆ తరువాత దానిలో నిమ్మరసాన్ని పిండి బాగా కలపాలి, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ తేనేని , కొన్ని గోరువెచ్చని నీళ్ళని కలిపి బాగా మిక్స్ చేస్తే జ్యూస్ తయారవుతుంది, ఏ జ్యూస్ ని ఉదయం లేచిన వెంటనే తాగాలి, ముఖ్యంగా గర్భంతో ఉన్న ఆడవాళ్ళూ ఈ జ్యూస్ ని తాగవద్దు.
Must Read: మీరు పుట్టిన నెలను బట్టి మీ మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు…!