మనలాంటి మధ్యతరగతి వాళ్ళమే అతిధుల దగ్గరి నుండి మాట రాకూడదు అని పెళ్ళిలో ఎలాంటి లోటు ఉండకూడదు అనుకుంటాము. అలాంటిది డబ్బునోళ్ల పెళ్లి అంటే మామూలు మాటలా. ఇక మన దేశంలో డబ్బునోళ్లు అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది అంబానీ ఫామిలీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇషా అంబానీ, ఆనంద్ పిరమాల్ వివాహం డిసెంబర్ 12న జరగనుంది. పెళ్లికి ముందు రెండు రోజుల వేడుకను ఉదయ్పూర్లో ఘనంగా జరుపుతున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇషా అంబానీ, ఆనంద్ పిరమాల్ వివాహం డిసెంబర్ 12న జరగనుంది. పెళ్లికి ముందు రెండు రోజుల వేడుకను ఉదయ్పూర్లో ఘనంగా జరుపుతున్నారు. శనివారం రాత్రి ప్రారంభమైన వేడుకలు నేటితో(డిసెంబర్ 9) ముగియనున్నాయి.
వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు సినీ, రాజకీయ ప్రముఖులు, అంతర్జాతీయ అతిథులు తరలివచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ కూడా విచ్చేశారు. ఈషా అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల ఎఫెక్ట్ ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై పడింది. ఎయిర్పోర్టులో ఒక్కఃసారిగా విమాన రాకపోకలు పెరిగిపోయాయి. ప్రైవేటు ఫ్లైట్లు, విమానాలతో కిక్కిరిసిపోయింది. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు తమ ప్రైవేట్ ఫ్లైట్స్లో తరలివచ్చారు. ఈ క్రమంలో ముంబైలోని విమానాశ్రయం సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ ఎయిర్పోర్టులో ఒకే రోజు 1007 విమాన రాకపోకలు నడిచాయి. ఇది సరికొత్త రికార్డు. గతంలో 1003 విమానరాకపోకలు నడిచాయి. ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అయ్యింది.