నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ‘అ..ఆ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత హీరో రామ్ చాలా కాలంగా ఎదురు చూసిన హిట్ ని ఇచ్చిన ‘నేను శైలజ’ డైరెక్టర్ కిషోర్ తిరుమల తో ఓ సినిమా చేయడానికి యంగ్ హీరో నితిన్ తో సిద్దం అయ్యాడు. రీసెంట్ గా కిషోర్ తిరుమల చెప్పిన స్టొరీ లైన్, బ్రీఫ్ స్టొరీ నితిన్ కి బాగా నచ్చాడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
‘నా తదుపరి సినిమా విషయాన్ని హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటున్నాను. నా నెక్స్ట్ మూవీ నేను శైలజ ఫేం కిషోర్ తిరుమలతో ఉంటుంది. అది కూడా మా హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో ఉంటుంది. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’ అని సోషల్ మీడియాలో తెలిపాడు.ప్రస్తుతం నితిన్ చేస్తున్న ‘అ..ఆ’ సినిమా ఏప్రిల్ 22న ఈ సినిమా రిలీజ్ కానుంది. ‘ఆ..ఆ ‘ సినిమా విడుదల అయిన తరువాత కిషోర్ తిరుమల సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.
Hi all..happy to announce that m doing a film with kishore tirumala(nenu shailaja) under SRESHTH movies..other details soon..????
— nithiin (@actor_nithiin) February 6, 2016