భారత్ వరల్డ్ కప్ గనక సాధిస్తే టీం సభ్యులముందు నగ్నంగా నిలబడతా అంటూ ప్రకటించిన పూనం పాండే గుర్తుందా? 2011 వరల్డ్ కప్ గనక ధోనీ సేన భారత్ దేశానికి తీసుకు వస్తే భారత్ టీం మొత్తం ముందూ నా బట్టలు తీసెస్తా అంటూ పూనం చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదం అయ్యాయి. పనిలో పనిగా పూనం కి ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. ఆమె కెరీర్ ఓ మూడేళ్ళ పాటు అమాంతం సక్సెస్ రూట్ లో దూసుకు పోయింది. అయితే ఇదంతా ఇప్పుడేందుకంటారా? అచ్చం పూనం లాగే ఈ టీ20 వరల్డ్ కప్ కి కూడా ఓ మోడల్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించేసింది. క్రికెట్ టీం కి మాత్రమే కాదు ఏకంగా దేశం లో ఉన్న ప్రజలందరికీ కనిపించేలా వంటి మీద నూలుపోగు లేకుండా డాన్స్ చేస్తానంటూ ప్రకటించేసింది. అయితే ఈ బంపర్ ఆఫర్ భారత్ కి కాదు మన ప్రత్యర్థి దేశం అయిన పాకిస్థాన్ కి…
పాకిస్థాన్లో పూనం పాండే తరహాలో ఓ మోడల్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. వరల్డ్ కప్ కొట్టక పోయినా పర్లేదు భారత్ తో మ్యాచ్ లో పాక్ గెలిస్తే చాలట. ఐసీసీ వరల్డ్ ట్వంటీ20లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్లో భారత్ను పాక్ జట్టు ఓడిస్తే చాలు, యావత్ పాక్ ప్రజల ముందు ‘స్ట్రిప్ డ్యాన్స్’ చేస్తానంటూ కాందిల్ బాలోచ్ అనే ఓ యువ మోడల్ ప్రకటించింది.
ఈ మేరకు పాకిస్థాన్కు చెందిన మోడల్ కాందీల్ బాలోచ్ ఓ వీడియోని ఫేస్బుక్లో పోస్టు చేసింది. ఐసీసీ వరల్డ్ టీ20లో మార్చి 15 (మంగళవారం) నుంచి సూపర్ 10 మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఐసీసీ టోర్నీలో భాగంగా మార్చి 19న కోల్కత్తలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది.
ఈ ‘స్ట్రిప్ డ్యాన్స్’ ప్రదర్శనను పాకిస్థాన్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి అంకితమిస్తానని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. సోషల్ మీడియా వెబ్సైట్ ఫేస్బుక్లో అప్ లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు పెద్ద సంచలనం రేపుతోంది. అయితే ఈ ప్రకటన వ్యవహారం పై ముస్లిం సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆమె మీద విమర్షలు వెల్లువెత్తుతుంటే, పాక్ ప్రజలు మాత్రం క్రికెట్ కన్నా ఆమె అందాల మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నారు…