మన పక్క దేశంగా ఉన్న పాకిస్తాన్ ఎప్పుడూ… ఎదో ఒకటి చేసి మన దేశాన్ని కించ పరిచే విధంగా చేస్తూనే ఉంది. మన దేశం ఎప్పుడూ… శాంతి, శాంతి అంటూ చర్చలు జరుపుతూనే ఉంటుంది. కానీ పాకిస్తాన్ చేసే పని చేస్తూనే ఉంది. ఈసారి మాత్రం దేశాన్ని కాకుండ హిందువులను కించే పరిచేలా వారి మనోభావాలను దెబ్బతీసేలా వారు పూజించే “ఓం” ఆకారాన్ని చెప్పులపై ముద్రించి ‘జెబ్ షూస్’ అనే కంపెనీ అమ్మకాలు జరుపుతుంది.
దీనికి ముఖ్యకారణం పాకిస్తాన్ లో ఎక్కువగా ముస్లింలు ఉంటారు. అక్కడ చాలా మందికి భారతదేశం అన్నా, అలాగే హిందువులు అన్నా.. కోపం. ఆ కంపెనీ అదే అదునుగా భావించి హిందువులు పవిత్రంగా పూజించే ‘ఓం’ గుర్తుని చెప్పులపై ముద్రించి అమ్ముతున్నారు. పాకిస్తాన్ లో కూడా దాదాపు 80లక్షల మంది హిందువులు ఉన్నారు వారికి ఈ విషయం తెలిసి వాటిని అమ్మకూడదు, ఒక మతాన్ని కించపరుచ కూడదు అన్నా…, వారి మాటను ఏ మాత్రం పట్టించుకోకుండా యధావిధంగా అమ్ముతూనే ఉన్నారు. దానితో పాకిస్తాన్ హిందువులు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ‘జెబ్ షూస్’ కంపెనీపై ఫిర్యాదు చేశారు,