అత్తారింటికి దారేది అనే సినిమా బీవీఎస్ఎన్ ప్రసాద్ కు ఎన్ని ఇబ్బద్దులు తీసుకోచ్చిందో అన్ని డబ్బులు కూడా తీసుకోచ్చింది అత్తారింటికి దారేది సినిమాలో హీరో పవన్ అనే విషయం అందరికి తెలిసిందె, అలాగే దాని డైరెక్టర్ త్రివిక్రం ఈ సినిమాను ఒక అద్బుత కావ్యంగా మన ముందుకు తీసుకోచ్చారు. అయితే ఇప్పుడు పవన్ బీవీఎస్ఎన్ పైన ‘మా’మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ను సంప్రదించి ఫిర్యాదు చేయడం జరిగింది. ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల ముందే బయటకు లీక్ అయిన సంగతి తెలిసిందే, ఆ పరిస్థితులలో సినిమా ఎలా ఉంటుందో తెలియక పవన్ త్రివిక్రం నిర్మాతకు అండగా ఉండేందుకు తమకు రావాల్సిన రెమ్యూనరేషన్ తర్వాత తీసుకుంటామని పెద్ద మనసుతో ఒప్పుకున్నారు అనే విషయం మీడియ ముందు నిర్మాత ఒప్పుకున్నాడు.అత్తారింటికి దారేది విజయం సాధించి లాభాలు తెచ్చి పెట్టిన, తనకు రావలసిన డబ్బులూ విషయంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నాన్నకు ప్రేమతో సినిమా విడుదల ముందే ఇస్తా అని మాట ఇచ్చి ఇంతవరకు డబ్బులు ఇవ్వకుండా మాట తప్పారని పవన్ కళ్యాణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఫిర్యాదును స్వీకరించిన ‘మా’… దాన్ని నిర్మాతల మండలికి పంపింది.
పవన్ కళ్యాణ్ మంచి చెయ్యబోతే నిర్మాత చెయ్యి ఇయ్యడం ఇది ఎంత వరకు న్యాయం ప్రసాద్ గారు. ఇదంత చూస్తుంటే ఏనుకటికి ఒక్కడు పాపం అని పచ్చిపులుసు పోస్తే కారం అని కచ్చిరు ఎక్కిండట! అనే శాస్రం లెక్కనే ఉన్నాది.