తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఇప్పుడు టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు అంటేనే ఒక సంచలనం.. తను సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో రికార్డులను తిరగరాసిన పవన్ కళ్యాణ్ ఇక త్వరలో బుల్లితెరపై కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే కమర్షియల్ పోగ్రాం లాగ కాకుండా సామాజిక సమస్యలను చర్చించే సత్యమేవ జయితే తరహా పోగ్రామ్ లో ఆయన కామెంటర్ గా కనిపించి అలరించనున్నట్లు చెప్పుకుంటున్నారు. గతంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన సత్యమేవ జయితే లాంటి కాన్సేప్ట్ కావంటంతో వెంటనే పవన్ సైతం ఉత్సాహం చూపినట్లు సమాచారం. అది తన పొలిటికల్ కెరీర్ కి సైతం మైలేజ్ ఇస్తుందనే నమ్మకంతో ఒప్పుకున్నట్లు చెప్పుకున్నారు. రామోజీ, పవన్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యంతో ‘ఈటీవీ’ లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాకతో ఈటీవీ టెలివిజన్ చరిత్రలో సంచలనం సృష్టించడం ఖాయమని తెలుస్తుంది. వెండితెరపై తన సినిమాలతో రికార్డులు సృష్టించిన పవన్ బుల్లితెరపై టీఆర్పీ రేటింగ్స్ లో రికార్డ్స్ ఎలాంటి బద్దలుకొట్టనున్నడో వేచిచూడాల్సిందే..!!