పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆసక్తిగా మారాయి. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లోను, ఏపీలో మిగిలిన కార్పొరేషన్లకు జరిగే ఎన్నికల్లోను జనసేన పోటీ చేయనుంది. ఇక పవన్ కూడా గబ్బర్సింగ్-2 సినిమా తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్బై చెప్పి వచ్చే సాధారణ ఎన్నికల నాటికి తన జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేసుకునే పనిపై దృష్టి పెట్టినట్టు సమాచారం. అయితే తేదేపా తో మిత్రపక్షంగా ఉంటాడా లేదా అప్పటకీ బీజేపీతో జనసేన జతకట్టే అవకాశాలున్నాయా.. తేదేపా ఒంటరవుతుందా అన్నది తెలియడం లేదు. ఏదేమైనా ప్రస్తుతం జనసేనకు రాజకీయ పార్టీగా గుర్తింపు రావడంతో రెండు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయన్నది పెద్ద చర్చనీయాంశమైంది. ఇక పవన్ కూడా సినిమాలకు గుడ్ బై చెపుతురాన్న ప్రచారం జరుగుతోంది. చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయిన్ మరొకరికి లేదు. జనసేన పార్టీతో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్….అభిమానులకి ఓ షాకింగ్ న్యూస్ ఇవ్వబోతున్నాడు. ఇక సినిమాలకు అయన పూర్తిగా దూరం అవుతారట. 2017 నుంచి వెండితెరకు గుడ్ బై చెప్పనున్నారు అని టాక్.
రైతు భవిష్యత్ నే ఏ జెండా గా తీసుకొని పవన్ ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. అందుకే పవన్ ‘సర్దార్ ‘ త్వరగా పూర్తి చేసి పని లో పడ్డాడట..అంతే కాదు ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయేలోపు ఓ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం ఫై అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. సినిమాల బిజీలో పడి పాలిటిక్స్కు టైం కేటాయించలేకపోతున్నానంటూ కొన్ని విషయాలపై ట్వీట్స్ ఇస్తూ, అప్పుడప్పుడూ జనం మధ్యకి వెళ్ళటం ద్వారా ప్రజలకి దగ్గర కావటం వల్ల పార్టీ పై నమ్మకం తగ్గిపోయే ప్రమాదం ఉందని పవన్ అభిప్రాయ పడుతున్నారట. దీంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని పవన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటి నుంచి పొలిటికల్ బరిలో జనసేన పార్టీని పటిష్టంచేయాల్సిన అవసరం ఉందని పవన్ ఉద్దేశ్యం. అలాచేస్తేనే 2019 ఎన్నికల నాటికి బలమైన జనసేనను నిర్మించవచ్చన్న ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, కొన్ని సర్కిల్స్లో పవన్ సినిమాలకు దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పడమే జరిగితే అది ఎప్పుడు? అనేది కాలమే డిసైడ్ చేయాలి.