మహేశ్ కత్తి.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ పై చేసిన, చేస్తున్న విమర్శలకి బదులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది మహేశ్ కత్తి పై ఫోన్ కాల్స్ తో, మెసేజ్ లతో విరుచుకుపడుతున్నారు, ఇప్పటికే అనేక సార్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బెదిరింపుల గురుంచి ఫేస్ బుక్ పోస్ట్ చేసిన కత్తి మహేష్ మరోసారి ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు, ఎయిడ్స్ వైరస్ కంటే పవన్ కళ్యాణ్ ప్రమాదకరంగా మారారని, పవన్ అనే వైరస్ సమాజంలో ఒక జనరేషన్ పిల్లల భవిష్యత్ ని నాశనం చేస్తుందని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. ఫేస్ బుక్ లో తనను పందితో పోలుస్తూ వస్తున్న ఫోటోలు పోస్ట్ చేస్తున్న ఫేస్ బుక్ పేజీలు గీత ఆర్ట్స్ ఆఫీస్ లో నుండే పనిచేస్తున్నాయని, పవన్ అభిమానులకు తన ఫోన్ నంబర్ కూడా గీత ఆర్ట్స్ ఆఫీస్ నుండే షేర్ అయ్యిందని, అల్లు అరవింద్ తో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి విబేధాలు లేవని దీనిపై ఆయన తక్షణమే స్పందించాలని కోరారు. ఒకవేళ ఈ విషయాలు ఆయనకు ఆల్రెడీ తెలిసుంటే అటువంటి శునకానందానికి దూరంగా మహేశ్ కత్తి ఉండాలని కోరారు.
బెదిరింపులతో తనపై దాడి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చట్టపరమైన చర్యల కంటే సామాజిక చికిత్స అవసరమని తన ఫేస్ బుక్ స్నేహితులు ఎంతో మంది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై పోలీస్ ఫిర్యాదు చేయవచ్చు కదా అని అడుగుతున్నారని, చంపుతామంటూ తనకు వస్తున్న హెచ్చరికలు – అసభ్యరమైన కామెంట్ల నేపథ్యంలో తన స్నేహితులు ఈ సూచన చేస్తున్నారని తెలిపారు. అయితే తనను విమర్శిస్తున్న పవన్ ఫ్యాన్సులో ఎక్కువ మంది టీనేజర్లేనని… అభిమానమనే పిచ్చితో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని వారిపై ఫిర్యాదు చేస్తే వారి భవిష్యత్తు నాశనమవుతుందనే ఉద్దేశ్యంతో కంప్లయింట్ ఇవ్వట్లేదని కత్తి మహేష్ వ్యాఖ్యానించారు.
rue”>