పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల అందరికంటే ఎక్కువ లాభపడింది పేటీయం, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుండి గల్లీలలో ఉండే టీ కొట్టు వరకు పేటీయం ద్వారానే చెల్లింపులు జరిగేలా చేసి దేశంలో అతిపెద్ద ఆన్ లైన్ పేమెంట్ సంస్థగా పేటీయం గుర్తింపు పొందింది, ఇప్పుడు ఇతర ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్స్ కి పోటాపోటీగా ఆఫర్లని ప్రకటిస్తూ అందరిని ఆకర్షిస్తుంది, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా భారీ ఆఫర్లని పేటీయం ప్రకటించింది.రూ.27,200 విలువ చేసే ఐఫోన్ ఎస్ఈ32జీబీ ఫోన్ ను కేవలం 5990 రూపాయలకే అందిస్తోంది.. కాకపోతే ఆ డిస్కౌంట్ ని డైరెక్ట్ క్యాష్ రూపంలో కాకుండా వేరే విధంగా పేటీయం ప్రకటించింది. అవి ఏంటంటే..
ఐఫోన్ ధర రూ.27,200గా ఉంది. 15% డిస్కౌంట్ తో రూ.22,990లకే వస్తోంది. అయితే ఇక్కడే మరిన్ని డిస్కౌంట్లు ప్రకటించింది పేటీయం. ఒక కూపన్ కోడ్ ద్వారా మూడు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ రానుంది. దీంతో పాటు రూ.2000 ఫ్లైట్ వోచర్, రూ.2000 ఫ్యాషన్ కూపన్, రూ.1000 మొబైల్ యాక్ససరీస్ కూపన్ ఇవ్వనుంది. ఇవన్నీ కలుపుకుంటే(3000+2000+2000+1000) .. రూ.8000లు అవుతున్నాయి. అంటే ఫోన్ ధర రూ.14,990కి పడిపోనుంది. ఇదే సమయంలో ఏడాదిలోగా ఎప్పుడు ఫోన్ రిటర్న్ ఇచ్చేసినా రూ.9000 వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది. దీంతో ఫోన్ ధర రూ. 5,990 రూపాయలు మాత్రమే. అంటే 6వేలు రూపాయలకే మీరు ఐఫోన్ కొనుక్కున్నట్టే కదా.. ఇది అసలు విషయం.
ఫోన్ ప్రత్యేకతలు:
Offer Link : paytm.com/iphone-Offer