మనము పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి మన వాహనంలో 50,100,200, ఇలా చెప్పి మరి పెట్రోల్ కొట్టామంటాం కద! కానీ ఇక నుండి అలా రౌండ్ ఫిగర్ లో పెట్రోల్ కొట్టించకండి ఎందుకంటే మీరు అలా చేస్తే కచ్చితంగా 50ml నుండి 200ml వరకు నష్టపోతున్నట్టే …. మరి మీకెలా తెలుసు అంటారా! ఈ మధ్యా చాలా మంది యువకులు మోసపోయి అనుమానం వచ్చి మరి ప్రాక్టికల్ గా పట్టుకున్నారు. అలా పట్టుకోవడమే కాకుండా ఆ విషయాన్ని ఫేస్ బుక్ లో దానిని పోస్ట్ చేశారు అంటే ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ అయి కూర్చుంది.
మరి ఇంతకు బంక్ వారు మనల్ని ఎలా మోసం చేస్తారో తెలుసా! … పెంట్రోల్ పొసే పంపులో డిజిటల్ ప్రొగ్రమింగ్ ని ముందే వారు సెట్ చేసి పెట్టుకుంటారు దానితో మనకు ఎలాంటి అనుమానం రాదు. మనకు ఒక వేళా బాటిల్లో కావాలంటే మాత్రం వేరే పంపు నుండి తీసుకోమంటారు అది వాళ్ళ లెక్క. కానీసం ఇలా ఒక్క రోజులో ఎన్నో డబ్బులు వాహన దారులు నష్టపోతున్నారు. ఇలా ఒక్క బంక్ లోనే కాదు చాలా బంక్ లలో చేస్తున్నారు. కానీ దొరికినోడే దొంగ, దొరకనాడు దొర అన్నట్టు ఉంది. ఇక ప్రభుత్వం గురించి మనకు తెలిసిందే కద కళ్లుండి చూడలేని గుడ్డిది అవుతుంది. ఎందుకంటే ఆ బంక్ వారి పార్టీకి సంబందించిన వాడిదై లేకా వాడి చుట్టనిదై ఉంటుంది అందుకే దానిని పట్టించుకోరు. ఒక వేలా పట్టించుకున్న వారం రోజులలో మళ్ళీ దానిని ఓపెన్ చేస్తారు. మరి వాహన దారులు ఎలా గుర్తు పట్టాలి అంటే …
1. మనం పెట్రోల్ వాహనంలో కొట్టించే సమయంలో బంక్ లోని పనివాళ్ళు మన దృష్టిని మల్లించడానికి ఎదో ఒక కారణం తో మనతో మాట్లాడుతారు.
2. అలాగే ఏ సమయంలోనైనా రౌండ్ ఫిగర్ తో పెట్రలో కొట్టించకండి అంటే 50,100,200.
3.అలాగే పెట్రోల్ పొసే సమయంలో మధ్యలో పంపు ని ప్రెస్ చేస్తుంటారు. అలా చేయడం వలన పెట్రోల్ ఆగి వస్తుంది దానితో కూడా పెట్రోల్ సేవ్ అవుతుంది వారికి మనకు బొక్క వవుతుంది.