ముంబై హోటల్ లో వీరంగం సృష్టించిన పూజా మిశ్రా గుర్తుంది కదా. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది మీద చెయ్యి చేసుకుని వీరంగం సృష్టించిన ఈ ముంబై మోడల్, ఇప్పుడు తాజాగా ఢిల్లీ కరోల్ బాగ్ లో ఒక ఇద్దరు యువకుల మీద చెయ్యి చేసుకుని, నానా దుర్భాషలు కూడా ఆడింది. కారణం ఏమిటో తెలియదు కానీ, ఈ ముంబై మోడల్ తరచూ ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది….తాజాగా ఢిల్లీ కరోల్ బాగ్ ఏరియాలో ని ఒక షాపింగ్ మాల్ లో ఈ రకంగా గొడవకు దిగిన వీడియో తో పూజ మిశ్రా మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా నడుస్తోంది.