సినీ హీరో ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ రాజు చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఒక చెక్ బౌన్స్ కేసులో యూవీఎస్ఎస్ఆర్ ప్రబోధ్కు హైదరాబాదులోని రాజేంద్రనగర్ కోర్టు సంవత్సరంపాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది.అలాగే రెండు నెలల వ్యవధిలో రూ. 80 లక్షల నగదును వ్యాపారవేత్తకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం ఆదేశించింది.
ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా చిత్రానికి అతని సోదరుడు ప్రభోద్ నిర్మాతగా వ్యవహారించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సికింద్రాబాద్కు చెందిన గంగాగనాతే అనే మహిళ దగ్గర రూ.43 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే నిర్ణీత గడువుతీరినా అప్పు చెల్లించకపోవడంతో గంగాగనాతే తన డబ్బు ఇచ్చేయాలని కోరింది. డబ్బులు ఇవ్వకుండా ప్రబోధ్ చెక్కు ఇచ్చాడు. అయితే ఆ చెక్ల్ బౌన్స్ కావడంతో ఆమె మరోసారి అతడిని సంప్రదించింది.అయినా ప్రభోద్ సరైన జవాబు ఇవ్వక పోవటమూ, ఎంతకీ డబ్బుకూడా ఇవ్వకపోవడంతో 2013లో కోర్టును ఆశ్రయించింది.రెండేళ్ళ పాటు కేసును విచారించిన కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. నిందితుడు ప్రభోద్ కి సంవత్సరం జైలుశిక్షతో పాటు బాధితురాలికి నష్టపరిహారం కింద రెండు నెలల్లో రూ.87 లక్షలు చెల్లించాలని రాజేంద్రనగర్ రెండో ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ సీవీపీఎస్ ఛార్లెస్ తీర్పు చెప్పారని పాండురంగారెడ్డి వివరించారు.