సినిమా సినిమాకి ఏదోఒక వైవిధ్యం చూపడానికి ఇష్టపడే యంగ్ హీరో శర్వానంద్ ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న తర్వాత మరోసారి ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేస్తూ చేసిన సినిమా ‘ఎక్స్ ప్రెస్ రాజా’..వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని గాంధీ చేస్తున్న సినిమా ఇది. తొలి సినిమా తరహాలోనే పూర్తిస్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది ఎక్స్ ప్రెస్ రాజా. శర్వానంద్ కూడా ఫుల్ ఎనర్జిటిక్ రోల్ లో కనిపిస్తున్నాడు. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్.రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా వచ్చి ఆడియో రిలీజ్ చేసాడు.
ఈ ఆడియో లాంచ్ లో ఎక్స్ ప్రెస్ రాజా థియేటర్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈన్స్ ట్రైలర్ కి అన్ని వర్గాల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ని స్టార్ట్ టు ఎండ్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉండేలా కట్ చేసారు. ప్రతి ఒక్కరూ సినిమాలో సూపర్బ్ కామెడీ ఉంటుందని ఆశిస్తున్నారు. మిర్చి, రన్ రాజా రన్, జిల్, భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాలు అందించిన వంశీ – ప్రమోద్ లు యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. శర్వానంద్ సరసన బీరువా ఫేం సురభి హీరోయిన్ గా కనిపించనుంది. సప్తగిరి చేసిన ఓ కీ రోల్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని సమాచారం.