కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేశాక, చేతిలో సరిపడా డబ్బులు లేక చాలా చోట్ల ఇంటి నిర్మాణాలు మధ్యలో ఆగిపోగా, కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకునే వారు మొదలు కూడా పెట్టని పరిస్థితి ఎదురైంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు చేరిన 15 లక్షల కోట్లలో అధిక మొత్తాన్ని ఇళ్లు కట్టుకునే వారికి ప్రభుత్వం అప్పుగా ఇవ్వనుంది. ఇందుకోసం ప్రభుత్వం 50పైసలలోపు వడ్డీ మాత్రమే తీసుకునేలా ఫిబ్రవరి 1న బడ్జెట్ లో స్పష్టమైన ప్రకటన సైతం చేయబోతున్నారు. ఈ దెబ్బతో దేశంలో 4-5 కోట్ల మంది సామాన్యులను సొంత ఇంటి వారిని చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంతేకాదు ఇప్పటికే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కూడా అమల్లో ఉంది. దాని ద్వారా 2 లక్షల వరకు వడ్డీపై గరిష్ఠ సబ్సిడీ సైతం వస్తుంది. ఇప్పుడు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నా లేక కొనుక్కున్నా, రేపు ప్రభుత్వం ప్రకటించబోయే వడ్డీ రాయితీ వర్తిస్తుందని ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. బ్యాంక్ లోన్, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ఈ విధంగా చేయాలి.
సాధారణంగా ఇంటి నిర్మాణానికి పది లక్షలు అవుతాయనుకుంటే కనీసం చేతిలో నాలుగు లక్షలైనా ఉండాలి. మిగిలిన ఆరు లక్షల రూపాయలకు లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు అమల్లో ఉన్న 9 శాతం వడ్డీరేటు (నెల తర్వాత ఈ రేటు తగ్గుతుంది) ప్రకారం EMI 6,085 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇంటి రుణానికి దరఖాస్తు చేసుకుంటే వడ్డీపై గరిష్ఠంగా 2 లక్షల 20 వేలు సబ్సిడీ ఇస్తుంది.
ఉదాహరణకు..
కాబట్టి, దగ్గర్లోని బ్యాంక్కు వెళ్లి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి తెలుసుకోండి. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి.