Home / Entertainment / 60 ఏళ్ళకు బ్రేక్ వచ్చింది – పృధ్వీరాజ్

60 ఏళ్ళకు బ్రేక్ వచ్చింది – పృధ్వీరాజ్

Author:

prudhvi

మూడు దశాబ్దాలపైగా కష్టపడిన తర్వాత ఇప్పటికి తన లక్ష్యాన్ని చేరుకోగలిగానని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ చెప్పారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు తనకొక గుర్తింపు, స్థానం లభించాయని అన్నారు. రామ్‌చరణ్-శ్రీను వైట్ల బ్రూస్ లీ చిత్రం, రవితేజ కిక్-2, బెంగాల్ టైగర్ చిత్రాలు, బాలకృష్ణ డిక్టేటర్, పెద్ద చిత్రాలలో లో మంచి నవ్వులు పండించి ఇప్పుడు టాలివుడ్ బిజీ కమిడియన్ అయ్యాడు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్ పృథ్వీకి రోజు రోజుకూ క్రేజ్ పెరిగిపోతోంది. ఇటీవలే విడుదలైన ‘శంకరాభరణం’ చిత్రం ఎలా ఉంది అని అడిగితే, పృథ్వీకోసం ఒకసారి చూడొచ్చు అంటున్నారంటే అతడు ఎంత సక్సెస్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సౌఖ్యం చిత్రం ట్రైలర్‌లోనూ పృథ్వీయే బాగా హైలైట్ అయ్యాడు. దానిలో బాహుబలి గెటప్‌లో పృథ్వీ శివలింగం మోసే సీన్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఈ గెటప్ ఫోటోలు సోషల్ మీడియాలోనూ బాగా రౌండ్స్ కొడుతున్నాయి. ఒకే రోజు రెండు సినిమాల ద్వారా పృథ్వీ హాట్ టాపిక్ అయ్యాడు. అందుకే పృథ్వీకి క్రేజ్ పెరిగిపోతోంది.

ఇంకా పృధ్వీ తన గురించి ఒక మాట్లాడుతు ఇప్పుడు మంచి పాత్రలు లభిస్తున్నాయని చెప్పారు. గత ఏడాది వచ్చిన లౌక్యం చిత్రం తనకొక టర్నింగ్ పాయింట్ అని, ఆ చిత్రంలోని బాయిలింగ్ స్టార్ బబ్లు పాత్ర తనకిచ్చినందుకు శ్రీవాస్‌కు రుణపడిఉంటానని అన్నారు. 1992లో ఆ ఒక్కటి అడక్కు చిత్రం ద్వారా మొదలైన ఈ ప్రయాణం ‘ఖడ్గం’తో ఒక లెవెల్‌కి, ఇప్పుడీ వరుస సినిమాలతో మరో లెవెల్‌కి వెళ్ళింది. ప్రస్తుతానికి వ్యక్తిగతంగా, వృత్తి పరంగా పరిపూర్ణమయ్యా. అందరి సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందని అనుకుంటున్నా”. ఇప్పటివరకు దాదాపు వందకుపైగా చిత్రాలలో నటించారు. ఇండస్ట్రీలో తొక్కేయడాలు లాంటివి ఉండవు. మన వల్ల సినిమాకు ఉపయోగం ఉందనుకుంటే అవకాశాలు అవే వస్తాయి..అని అన్నారు.

(Visited 43 times, 1 visits today)