Home / Entertainment / నేనింతే అంటున్న పూరి

నేనింతే అంటున్న పూరి

Author:

Puri-Jagannadh-Director

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రముఖ నిర్మాత సీఆర్ మనోహర్ కుమారుడు ఇషాన్ ని హీరోగా పరిచయం చేస్తూ ‘రోగ్’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు . ఆ చిత్రం కేవలం 10రోజులు కూడా షూటింగ్ జరుపుకోకముందే సినిమా ఆగిపోయింది. అయితే తన మాట ఎవరు వినడం లేదని ఇప్పటికి చాలా సార్లు చెప్పినా, అసలు నన్ను పట్టించుకోవడం లేదని పూరి చెబుతున్నాడు. తన వద్ద పనిచేస్తున్న స్టాఫ్ కి పెద్ద షాక్ ఇచ్చాడు. సినిమా ఆగిపోవడానికి చిత్ర యూనిట్ సభ్యులేనని కోపంతో పూరి అందరిని పనిలో నుండి పీకిపారేసాడు. తన వద్ద పనిచేస్తున్న 25 మంది స్టాఫ్ ని బుధవారం సాయంత్రం తీసేసాడు.

గత రెండేళ్లుగా అందరికి పద్ధతి మార్చుకోమని చెప్తూ వస్తున్నానని వాళ్ళ ప్రవర్తనలో మాత్రం మార్పు లేదని, నా రూల్స్ ఎవరు పాటించడంలేదని, నన్ను అసలు వాళ్ళు లెక్కకూడా చేయడంలేదని తెలిపాడు. తను ఈ నిర్ణయం ఆలోచించే తీసుకున్నానని క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కాదని పూరి చెప్పుకొచ్చాడు. గత కొంతకాలంగా ఛార్మికి పూరికి మధ్య ఏదో జరుగుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వార్తలు కూడా బయటికి చిత్ర యూనిట్ నుండి వెళ్లాయనే కోపంతో పూరి ఇలా చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో కొత్త స్టాఫ్ ని తీసుకుంటానని, ప్రస్తుతం నా ఆఫీస్ లో ఒక్కడినే ఉంటున్నానని పూరి తెలిపాడు.

(Visited 77 times, 1 visits today)