పీవీపీ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళ సినిమా నిర్మాణ రంగంలో ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తూ ఉంది. దీనికి కారణం సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే భారీ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది పీవీపీ సినిమా. ఇప్పటికే ‘విశ్వరూపం’, ‘బలుపు’, ‘వర్ణ’ ,‘సైజ్జీరో’, ‘బెంగళూర్ డేస్’ తమిళ రీమేక్ తదితర సినిమాలతో మంచి సినిమాలను నిర్మించిన ఈ సంస్థ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఓ వైపు భారీ బడ్జెట్ పెద్ద సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్న సినిమాలను నిర్మించే పనిలో పడింది.ప్రస్తుతం నాగార్జున-కార్తీ కాంబినేషన్లో “ఊపిరి”, అడవి శేష్ హీరోగా నటిస్తున్న ‘క్షణం’ అనే సినిమా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అలాగే ప్రస్తుతం “బ్రహ్మోత్సవం”,”ఘాజీ” వంటి ప్రతిష్టత్మకమైన సినిమాలను వరుసగా నిర్మిస్తోంది.
పీవీపీ సినిమా త్వరలో ఓ పెద్ద మల్టీస్టారర్తో ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. పదిమంది హీరోయిన్లతో ఒక భారీ మల్టీస్టారర్ను నిర్మించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాలో ప్రతీ ఒక్క క్యారెక్టర్కూ ఓ ప్రాధాన్యత ఉంటుందట. దీంతో ఈ పది పాత్రలకూ స్టార్ హీరోయిన్స్నే ఎంపిక చేయాలనేది పీవీపీ టీమ్ ప్లాన్. అందుకు తగ్గట్లే ప్రస్తుతం పలువురు స్టార్స్తో చర్చలు జరుపుతున్నారట. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఒకే సినిమాలో ఏకంగా పదిమంది హీరోయిన్స్ కలిసి నటించడమంటే అది అతిపెద్ద విశేషమే అవుతుందని చెప్పొచ్చు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తైందని సమాచారం.