శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్క అవయవం పనితీరులో తేడా వచ్చినా.. శరీరంలో మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పు మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది. శరీరంలోని అవయవాల్లో అత్యంత కీలకమైన అవయవం లివర్. మనం తీసుకునే ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహించి, మిగిలిన విష పదార్థాలతో పాటు చెత్తను బయటకు పంపించి వేసే అత్యంత కీలకమైన అవయవం. ఈ అవయవం రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అలాంటి లివర్కు కూడా అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు సోకే సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా.. సిరోసిస్, హెపటీస్ ఏ, బి, సితో పాటు… అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. వీటితోపాటు.. అత్యంత ప్రమాదకరమైన ఫ్యాటీ లివర్స్ కూడా సోకే ప్రమాదం ఉంది. దీనికి కారణం మారిన ఆహారపు మరియు మద్యపానం- ధూమపానం అలవాట్లు.
అలాంటి అత్యంత కీలకమైన ఈ అవయవాన్ని రక్షించుకునేందుకు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవటమే కాకుండా, ఇంట్లోనే ఉంటూ మనకు సాధారణంగా మార్కెట్లో లభించే ఎండు ద్రాక్ష డ్రింక్ తీసుకుంటే సరిపోతుంది. ఈ డ్రింక్ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు నాణ్యమైన ఎండు ద్రాక్షకు, మూడు కప్పుల నీటిని కలిపి 20 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని 24 గంటల పాటు నిల్వ చేయాలి. ఈ డ్రింక్ను వారం రోజుల పాటు తాగడం వల్ల లివర్ పూర్తిగా క్లీన్ అవుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. అయితే, ఈ డ్రింక్ తీసుకోవాలనుకునే వారు ముందుగా మద్యం అలవాటు ఉన్నట్లయితే, పూర్తిగా మద్యానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.