రాజ్ తరుణ్ – అవికా గోర్ల ఈ జంట ఇప్పటి వరకు తెలుగు తెరపై చేసిన సందడి అంతా ఇంతాకాదు. ‘ఉయ్యాల జంపాల’,‘సినిమా చూపిస్త మావా’.. ఇలా రెండు సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన ఈ జోడి తాజాగా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.తాజ సమాచారం ప్రకారం మంచు విష్ణు – రాజ్ తరుణ్ హీరోలుగా ఈ మధ్యే ఓ మల్టీస్టారర్ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించనున్నారు.
ఓ పంజాబి సూపర్ హిట్ సినిమాకు రీమేక్గా తెరకెక్కనున్న ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాకీ సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ప్రస్తుతం చివరిదశకు చేరాయి. త్వరలోనే సెట్స్పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్కు జోడిగా నటించే హీరోయిన్ కోసం పలువురు ఇతర హీరోయిన్స్ను సంప్రదించి చివరకు అవికా గోర్నే సంప్రదించగా, ఆమె కూడా వెంటనే ఓకే చెప్పేశారని సమాచారం. మంచు విష్ణు సరసన హీరోయిన్గా నటించేందుకు ఇప్పటికే అమైరా దస్తూర్ ఎంపిక కాగా, త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్ళనుంది.