Home / Entertainment / చిత్ర యూనిట్ సభ్యులందరి కి రాజమౌళి హెచ్చరిక.

చిత్ర యూనిట్ సభ్యులందరి కి రాజమౌళి హెచ్చరిక.

Author:

SS Rajamouli Bahubali2

‘బాహుబలి-2’ సినిమా షూటింగ్ ని గురువారం రామోజీ ఫిలింసిటీలో ప్రభాస్, రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలతో ప్రారంభించారు. ‘బాహుబలి-2’ చిత్ర షూటింగ్ కి ముందుగానే చిత్ర యూనిట్ సభ్యులందరినీ సమావేశపరిచి రాజమౌళి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. బాహుబలి మొదటి భాగం విడుదల కాకముందే అందులోని పోరాట సన్నివేశాలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కీరవాణి అందించిన కొన్ని పాటలు కూడా విడుదలకి ముందే లీక్ అవడంతో ఇటీవలే చిత్ర యూనిట్ అందరిని రాజమౌళి హెచ్చరించారు.కోట్ల బడ్జెట్ తో.., కొన్ని వందల మంది కష్టపడి తెరకెక్కిస్తున్న ఇటువంటి చిత్రాలలోని సన్నివేశాలను, పాటలను రిలీజ్ కి ముందే లీక్ చేయడం వలన చాలా నష్టపోతామని, కొన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసిన దానికి ఫలితం లేకుండా పోతుందని.., ఇటువంటివి ఎవరు చేసిన ఇక సహించేది లేదని రాజమౌళి కాస్త గట్టిగానే చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి సెల్ ఫోన్స్ ని కూడా నిషేదించారు. గతంలో జరిగిన పొరపాట్లు తిరిగి ‘బాహుబలి-2’ లో పునరావృతం కాకుండా రాజమౌళి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

(Visited 142 times, 1 visits today)