టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా బారీ ఆఫర్స్ తో దూసుకుపోతుంది. రకుల్ వెంకటాద్రి Express చిత్రంతో అందరి కళ్ళు తన పైపు తిప్పుకుంది. ఈ భామ ఈ ఏడాది సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన “నాన్నకు ప్రేమతో” మరియు బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ” సరైనోడు” లో నటించింది. ఈ రెండు చిత్రాలు బారీ విజయం సాధించాయి.
తాజాగా రకుల్ ప్రీత్ కు రెండు మెగా ఆఫర్స్ వచ్చాయి. S .J సూర్య దర్శకత్వం వహిస్తున్నపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రంలో రకుల్ ని కథానాయికగా ఎంచుకున్నారు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 10వ చిత్రం “ధ్రువ”లో కూడా రకుల్ నే కథానాయికగా ఎంచుకున్నారు. మరో మెగా హీరో అయిన సాయి ధరమ్ తేజ్ తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా నటిస్తుంది. రకుల్ ఒక్క ఏడాదే నలుగురి మెగా హీరోలతో నటించటం గమనార్హం.