Home / Entertainment / కూకట్ పల్లిలో కూరగాయలు అమ్ముతున్న రకుల్.

కూకట్ పల్లిలో కూరగాయలు అమ్ముతున్న రకుల్.

Author:

Rakul Pret Singh Selling Vegetables at Kukatpalli

మోహన్ బాబు కుమార్తె గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి లక్ష్మి మంచు. తను సినిమాల్లోనే కాకుండ టెలివిజన్ రంగంలో కూడా మంచి కార్యాక్రమాలు(ప్రేమతో మీ లక్ష్మితో, లక్కుంటే లక్ష్మి, దూసుకెళ్తా,బూమ్ బూమ్) సక్సెస్ ఫుల్ గా చేసింది. ఇప్పుడు సామాజిక కార్యాక్రమానికి నడుము ముందడుగు వేసింది, జెమిని టివి వారు సామాజిక శ్రేయస్సు కోసం ఒక ప్రోగ్రం నిర్వహించాడనికి లక్ష్మి ని హోస్ట్ గా తీసుకున్నారు. ఆ కార్యక్రమానికి అందరికి ఉపయోగాపడేలా ఉండాలనీ ‘మేము సైతం’ అంటు మన ముందుకు వస్తున్నారు.

ఈ కార్యక్రమం భాగంగా లో రకుల్ ప్రీత్ ట్విట్టర్ లో “మంచు లక్ష్మి నిర్వహించనున్న మేము సైతం కార్యక్రమం కోసం మంజీరా మాల్ దగ్గర ఉన్న కేపీహెచ్ బీ మార్కెట్లో నేను కూరగాయలు అమ్మబోతున్నాను. సమాజాన్ని మార్చే ఓ ప్రోగ్రాం ఇది. రండి ఉదయం 10గంటల నుంచి వచ్చి నా దగ్గర నుంచి కూరలు కొనుక్కోండి” అంటూ ట్వీట్ చేసింది.రకుల్ ప్రీత్ సింగ్ అమ్మే కూరగాయలను కొనాలనుకునే వారు వెంటనే కూకట్ పల్లి మార్కెట్ కి వెళ్ళొచ్చు, స్టార్ హీరోయిన్ దగ్గర కూరగాయలు కొన్నట్టు ఉంటది పనిలో పనిగా సమాజ సేవ చేసిన వారు అవుతారు.

(Visited 464 times, 1 visits today)