మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’, ‘బ్రూస్ లీ’ సినిమాలు అభిమానులను మెప్పించలేక పోయాయి. దానితో చరణ్ ఖాతాలో మరో రెండు ఫేల్యుర్ సినిమాలుగా నిలిచాయి.”బ్రూస్ లీ”సినిమా తర్వాత షూటింగ్ లకి కాస్త గ్యాప్ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ తన ఫ్యామిలీతో కొంత సమయాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడిప్పుడే రామ్ చరణ్ తన తదుపరి సినిమాపై దృష్టి పెడుతున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ ‘తని ఒరువన్’ రీమేక్ గా రానున్న చరణ్ నెక్స్ట్ మూవీకి సురేందర్ రెడ్డి డైరెక్టర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్న ఈ సినిమాని డిసెంబర్ లో అధికారికంగా లాంచ్ చేసి జనవరి సెకండాఫ్ నుంచి షూటింగ్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవలే హీరోకి గట్టి పోటీ ఇచ్చే మెయిన్ విలన్ పాత్ర కోసం ఒరిజినల్ వెర్షన్ లో నటించిన అరవింద్ స్వామిని ఖరారు చేసారు. ఈ రోల్ చేయడం కోసం అరవింద్ స్వామికి 5 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. ఇకపోతే ఈ చిత్ర టీం ఈ సినిమా కోసం ఓ పవర్ఫుల్ పోలీస్ టైటిల్ ని ఆలోచిస్తోంది. ఎక్కువ భాగం ‘రక్షక్’ అనే టైటిల్ ని ఖరారు చేసే అవకాశం ఉందని ఈ చిత్ర టీం అంటోంది. అల్లు అరవింద్ – ఎన్.వి ప్రసాద్ లు కలిసి నిర్మించే ఈ సినిమాలో చరణ్ కి జోడీ కట్టే హీరోయిన్ కోసం ప్రస్తుతం అన్వేషణ జరుగుతోంది.