నకిలీ కరెన్సీ నోటుని మీరు మొదటి చూపులోనే ఎలా గుర్తిస్తారు? మొట్ట మొదటగా మీరు చూసేది కరెన్సీ నోట్ల భద్రతకు ప్రామాణికంగా నిలిచే ‘సిల్వర్ త్రెడ్’ (నోటులో తీగలాగా మెరుస్తూ కనిపించేది) నే. ఐతే ఈ ముఖ్యమైన “గుర్తింపు లేకుండానే ఏకంగా ప్రభుత్వమే వెయ్యి రూపాయిల నోట్లను ముద్రించింది.అవి చలామనీలోకి వచ్చేసాయి కూడా, జరిగిన దారుణమైన పొరపాటుని ఆర్బీఐ ఆలస్యంగా గుర్తించి నాలుక కరచుకుంది. సిల్వర్ త్రెడ్ లేకుండా వచ్చిన ఈ నోట్లు భారత దేశ రిజర్వ్ బ్యాంక్ ముద్రించినవే అయినా అవి చెల్లవు.అయితే ఇప్పటికే అవి మార్కెట్ లోకి ప్రవేశించటంతో తలలు పట్టుకున్నారు. అయితే వెంటనే దానిని సరిదిద్దుకునే ప్రయత్నాలూ మొదలు పెట్టారు. వివరాల్లోకి వెళితే…
మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎమ్సీఐఎల్)లో ప్రింట్ అయిన కొన్ని సిరీస్ కరెన్సీ నోట్లలో ఈ పొరపాటు జరిగిందని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అంగీకరించింది. 5ఏజీ, 3ఏపీ సిరీస్తో ఈ నోట్లను ముద్రించారు. అయితే ఖచ్చితంగా ఎన్ని నోట్లను ముద్రించారో మాత్రం బయటికి వెల్లడించలేదు.నిజానికి ఎన్ని అధికారిక ముద్రలున్నా ఈ సిల్వర్ త్రెడ్ గనక లేకపోతే కరెన్సీ నోట్లు చెల్లవు,అవి నకీలీ నోట్ల పరిధిలోకే వస్తాయి.అందుకే ప్రజలు గనక ఈ సిరీస్లతో ఉన్న నోట్లను మార్చుకునేందుకు ఏబ్యాంకు కువచ్చినా ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకానివ్వకుండా ఆ నోట్లు తీసుకొని తీసుకొని వాటికి సమానమైన చెల్లుబాటయ్యే నోట్లు ఇవ్వాలని ఆర్బీఐ ఆదేశించింది. మరోవైపు, ముద్రణలో ఈ లోపంపై వివరణ ఇవ్వాలని ఎస్పీఎమ్సీఐఎల్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఈ ఉదంతంపై నివేదిక కోరింది.మీ నోట్లనీ ఒక సారి చెక్ చేసుకోండి మరి….
Must Read: యుట్యూబ్ లో సెన్సేషన్ క్రీయేట్ చేస్తున్న మెగా హీరోయిన్.