హీరోయిన్ శ్రియ మనకు పరిచయం అవసరం లేని నటి. మూడు పదులు వయసులో కూడా హీరోయిన్ శ్రియ అందం ఏమాత్రం తరగలేదు. ఇప్పటికీ కూడా అవకాశాలు వెతుక్కుంటూ తన దగ్గరికి వస్తూనే ఉన్నాయి. ఇటీవల నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలో రాణిగా నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది ఈ భామ. ఈ పాత్ర కోసం యూనిట్ సభ్యులు చాలా మంది బాలీవుడ్ మరియు టాలీవుడ్ హీరోయిన్స్ ను కూడా సంప్రదించారు. అయితే వారిలో కొందరికి డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరక, మరి కొందరేమో పాత్రను మేము చేయలేమని వద్దనేశారు. మరి వారంతా ఇంతకీ ఎందుకు వద్దన్నారంటే ఇందులో హీరోయిన్ ఇద్దరు పిల్లల తల్లి అన్నమాట. తల్లి పాత్ర చేయటానికి మనసొప్పక వద్దన్నారని, దాంతో చిత్ర యూనిట్ సభ్యులు శ్రియ ని సంప్రదించారని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.