Home / Entertainment / ఫ్లెక్సీపై ఫైర్ అయిన “యాంకర్ రేష్మి”..! ఇంతకీ అందులో ఏముందో తెలుసా.?

ఫ్లెక్సీపై ఫైర్ అయిన “యాంకర్ రేష్మి”..! ఇంతకీ అందులో ఏముందో తెలుసా.?

Author:

బుల్లితెర యాంకర్ రష్మీ గురించి అందరికీ తెలిసింది. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ సినిమా హీరోయిన్‌గానూ తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. బుల్లితెర‌పై చిట్టి పొట్టి బట్టలతో తన అందాలను ఆరబోస్తూ జబర్ధస్త్ యాంకర్ అనిపించికుంది రేష్మి. అక్కడితో ఆగకుండా ‘గుంటూరు టాకీస్’ చిత్రంలో తన హాట్ హాట్ అందాలను మాస్ ప్రేక్షకులకు నషాలానికి పట్టేలా చేసింది. ఈ సినిమా హిట్ కాలేనప్పటికీ.. కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లనే రాబట్టింది. కేవలం రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం రూ.40 కోట్లపైనే వసూలు చేసి నిర్మాతలకు కాసులు వర్షం కురిపించందంటే.. రేష్మి ఘాటైన గ్లామర్‌తో గుంటూర్ టాకీస్ వైపు ప్రేక్షకుల్ని రప్పించగలిగిందనే చెప్పాలి. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో హీరోయిన్‌గా రాణిస్తుందనే భావించారంతా.. అయితే ‘తను వచ్చెనంట’, ’నా నువ్వే’ చిత్రాల్లో నటించినప్పటికీ అవి రేష్మి కెరియర్ ఎదుగుదలకు ఏమాత్రం హెల్ప్ కాలేదనే చెప్పాలి.

అయితే అపజయం వెంటాడినప్పుడు కుంగిపోలేదు.. హీరోయిన్ అనే గ్లామర్ చట్రానికి పరిమితం కాకుండా తనకు లైఫ్ ఇచ్చిన బుల్లితెరవైపే మక్కువ చూపించింది. తాజాగా ఓ సంఘటన రేష్మీకి కోపం తెప్పించింది. ఈ ఘటన తిరుపతిలో జరిగింది. వివరాలలోకి వెళ్తే.

source

తిరుపతి లో రేష్మి – సుడిగాలి సుధీర్ ల ఫోటోలు పెట్టి ఓ ఫ్లెక్సీ వేశారు. ప్రజలలో క్యాన్సర్ పైన అవగాహనా కోసం 9వ తేదిన 10k రన్ లో ముఖ్య అతిధులుగా రేష్మి , సుధీర్ వస్తున్నారు అంటూ ఆ ఫ్లెక్షిలో పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరికి రష్మీ కంట పడింది ఈ పోస్ట్. ఆ ఫ్లెక్షిని వెంటనే తొలగించాలి అంటూ ఆమె నిర్వాకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటివరకు ఎవ్వరు నన్ను సంప్రదించలేదు అని అసలు నా అనుమతి లేకుండా నా ఫోటో ఎలా వేస్తారు అని ఆమె ప్రశ్నిస్తోంది.

(Visited 1 times, 1 visits today)