Home / Political / తెలంగాణాలో నక్సలిజం వస్తే బాగుంటుంది.

తెలంగాణాలో నక్సలిజం వస్తే బాగుంటుంది.

Author:

తెలంగాణా లో మిగిలిన ఏకైక టీడీపీ నేత ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్ ముందు మరోసారి విచిత్ర వ్యాఖ్యలు చేసారు…. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో ఆయన పాల్గొన్నారు.అక్కడే విలేకరులతో మాట్లాడుతూ. తన ఎప్పటి స్టైల్ లోనే మాట్లాడిన ఆయన విచిత్రంగా “నక్సలిజం వస్తే బావుండు” అని కోరుకున్నారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడారంటే.. తెలంగాణ రాష్ట్రంలో బిహార్ మాదిరిగా అరాచక పాలన నడుస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడింది. ప్రజలంతా అఖిలపక్షంగా ఏర్పడి అరాచకాలపై పోరాటం చేయాలి. ఒకప్పుడు నక్సలిజం అనేది అభివృద్ధి విరోధకంగా ఉండేదనుకున్నాను. కానీ, ప్రస్తుతం తెలంగాణలో నక్సలిజం వస్తే బాగుండును. యూనివర్సిటీల్లోని యువత నక్సలిజం వైపు మొగ్గు చూపుతోంది. సాగర్, శృతి ఇలానే నక్సలిజంలోకి వెళ్లి వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. కేసీఆర్ వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్‌కౌంటర్ జరిగింది. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ” అన్నారు. అయితే ఎవరికి మద్దతుగా అయితే ఆయన వెళ్ళారో. వారిలోనే ఉన్న మరో వ్యక్తి వాళ్ళొస్తే ముందు టార్గెట్ టీడీపీనే ఉంటుందేమో అనటం విశేషం….

(Visited 230 times, 1 visits today)