సూపర్స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పుకోవాల్సిన పనిలేదు, విడుదల అయిన అన్ని బాషలలో కోట్లు కొల్లగొట్టింది ఆ సినిమా. ఇప్పుడు అదే కాంబినేషన్ లో రోబో కి సీక్వెల్ గా ‘2.0’ సినిమా తెరకెక్కుతోంది. 400 కోట్ల భారి బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా విడుదలకు ముందే ఇంతకుముందు ఉన్న కొన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ‘2.0’ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ బాషల శాటిలైట్ ప్రసార హక్కుల రూపంలో విడుదల కు ముందే నిర్మాతలకు రూ.110 కోట్లు తెచ్చిపెట్టి కొత్త రికార్డు సృష్టించింది. ఈ మధ్యకాలంలో శాటిలైట్ ప్రసార హక్కుల రూపంలో 110 కోట్లు సాధించిన సినిమా ఏదీ లేదు.
‘2.0’ సినిమాలో సూపర్స్టార్ రజనీకాంత్ కి ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తుండగా అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ సంవత్సరం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.