తెలుగు చిత్రసీమలో నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీలు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ రెండు ఫ్యామిలీల నుండి స్టార్స్ ఎదిగారు. ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన హీరోల్ని ఒకే తెరపై చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ ఈ కాంబినేషన్ ఇప్పటివరకు సెట్ కాలేదు. అయితే తాజాగా గోపీచంద్తో యజ్ఞం, బాలయ్యతో వీరభద్ర లాంటి సినిమాలు తెరకెక్కించిన ఏఎస్.రవికుమార్ చౌదరి చాలా గ్యాప్ తీసుకుని మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా పిల్లా నువ్వులేని జీవితం సినిమాను తెరకెక్కించాడు.
ఈ మధ్యే ‘సౌఖ్యం’ సినిమాతో ఫ్లాప్ అందుకున్న దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి, మళ్ళీ తన ఫామ్ను తిరిగి తెచ్చుకోవాలన్న ప్రయత్నంతో ఓ బలమైన కథను సిద్ధం చేస్తున్నారట. ఇద్దరు హీరోలుండే ఈ కథకు నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్లను సంప్రదించగా ఇద్దరూ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది.