కృష్ణ వంశీ.. ఈ పేరు తెలియని వారు తెలుగు సినీ పరిశ్రమలో ఏవరు ఉండరు ఎందుకంటే అతను తీసిన సినిమాలు అతనికి పరిశ్రమలో మర్చిపోలేని పేరుని తీసుకొచ్చాయి. అతను ఎంచుకునే కథలు ఆ విధంగా ఉంటాయి. కృష్ణ వంశీ ఈ మధ్య కొద్దిగా హిట్ సినిమాల విషయంలో వెనుకబడిపోయాడు. అదే విషయాన్ని తను కూడ ఒప్పుకున్నాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం “నక్షత్రం “. ఈ సినిమాలో మరో హీరో కూడా ఉన్న విషయాన్ని కృష్ణ వంశీ ఇంతకు ముందే మనకు తెలియజేశాడు. ఆ హీరో ఎవరో కాదు సాయి ధరమ్ తేజ్. ఇందులో సాయి 20 నిమిషాల పాటు పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని స్వయంగా తెలియజేశాడు.
నక్షత్రం సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జంటగా ‘కంచె’ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించిన ప్రగ్యా జైస్వాల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తుందని. . అలాగే ఇందులో సందీప్ కి, ప్రగ్యా జైస్వాల్ కి మధ్య ఒక ఫైట్ కూడ ఉంది అని స్వయంగా కృష్ణ వంశీ తెలియజేశాడు. మరి ఈ ఇద్దరి జంట ఎలా కుదురుతుందో సినిమాలోనె చూడాలి.