Home / Entertainment / ‘కేరింత’తో ‘చిలిపి దయ్యం’న్ని చూపిస్తా : సాయికిరణ్ అడవి.

‘కేరింత’తో ‘చిలిపి దయ్యం’న్ని చూపిస్తా : సాయికిరణ్ అడవి.

Author:

Adivi-Sesh

దర్శకుడు సాయికిరణ్ అడవి చందమామ కథ లాంటి సినిమాలు ,మంచి మనిషి ఏవిధంగా సమస్యలను ఎదుర్కొంటాడనేది తన సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. ఇప్పటి వరకు సాయికిరణ్ చేసింది మూడు సినిమాలే వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత.. ఇలా ఈ మూడంటే మూడే సినిమాలతోనే తెలుగులో సెన్సిబుల్ డైరెక్టర్‌గా, మంచి దర్శకుడిగా తనకంటూ ఓ మార్క్ సెట్ చేసుకున్నాడు.

తాజా సమాచారం మేరకు సాయికిరణ్ తమ్ముడు అడివి శేష్, ‘కేరింత’ సినిమాలో నూకరాజు పాత్రతో మెప్పించిన పార్వతీశం ప్రధాన పాత్రల్లో ఒక సినిమా మొదలు పెట్టానున్నాడని వినికిడి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకొని సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు సిద్ధమవుతున్నారట!. ఈ సినిమాను సాయికిరణ్ స్వయంగా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాకీ ‘చిలిపి దయ్యం’ అనే ఒక ఆసక్తికరమైన టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ జానర్లో ఉంటుందని సమాచారం. ‘కేరింత’ సినిమాతోనే పరిచయమైన సుకృతి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది.

(Visited 109 times, 1 visits today)