స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘సరైనోడు’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. ఈ చిత్రం విడుదలకి ముందే శాటిలైట్ రైట్స్ బంపర్ ఆఫర్ కి అమ్ముడైపోయిందని సమాచారం. సన్ టీవి వారు…16 కోట్లు ఇచ్చి ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుందట! అయితే ఇంత భారీ ఆఫర్ ఒక్క తెలుగు వెర్షన్స్ కే కాకుండా! హింది, మళయాళం వెర్షన్స్ శాటిలైట్ రైట్స్ కూడా కలిసి ఉన్నాయట. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికేట్ పొందింది. థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.