భారత దేశం లోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ ఎస్బిఐ ప్రస్తుతం జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ సేల్స్), జూనియర్ అగ్రికల్చరల్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకోసం ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 13,734ఖాళీలు ఉన్నాయి . అందులో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ సేల్స్) 10,726 కాగా, 3,008 జూనియర్ అగ్రికల్చర్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 108 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో 387 పోస్టులు ఉన్నాయి. జనరల్ కేటగిరీకి తెలంగాణలో 55, ఆంధ్రప్రదేశ్లో 195 పోస్టులు కేటాయించారు. అగ్రికల్చర్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.600. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. 431 పోస్టులు, ఆంధ్రప్రదేశలో 1,385 పోస్టులు ఉన్నాయి. జూన్ 30 లోపు ఏదైనా ఒక డిగ్రీ పూర్తి చేసిన ఎవరైనా ధరఖాస్తు చేసుకోవచ్చు…
మెయిన్ ఎగ్జామ్లో నాలుగు టెస్ట్లు ఉంటాయి. ఈ పరీక్ష కూడా ఆనలైన్ విధానంలోనే జరుగుతుంది. రెండు గంటల 40 నిమిషాలసేపు జరిగే ఈ పరీక్షలో జనరల్/ఫైనాన్స్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ ఎబిలిటీకి సంబంధించిన 190 ప్రశ్నలు ఇస్తారు. మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అయితే ఇంటర్వ్యూ నిర్వహిస్తారా లేదా అన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి లోబడి ఉంటుంది. ఈ పరీక్షలను మే, జూన్ నెలల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం తదితర సమాచారం కోసం State Bank of India వెబ్సైట్ చూడవచ్చు. ఏప్రిల్ 25లోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.