శంకరాభరణం లాంటి క్లాసికల్ టైటిల్ తో వస్తున్న నిఖిల్ కొత్త సినిమా టీజర్ విదుదలైంది.స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంకరాభరణం’ టీజర్ ని తన అభిమాన నటుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా రిలీజ్ చేయించినందుకు తెగ సంతోష పడిపోతున్నాడు కుర్ర హీరో నిఖిల్.
యుఎస్కి చెందిన అత్యంత సంపన్నుడి కొడుకు నిఖిల్. ప్రపంచంలో సుఖపడే వాళ్లు, కష్టపడి పని చేసేవాళ్లు ఈ రెండు జాతులు మాత్రమే ఉంటాయన్నది హీరో నమ్మకం. తాను సుఖపడటానికే పుట్టనన్నది అతని ఫీలింగ్. అలాంటి అతను ఓ పని మీద ఇండియాకి వచ్చి అనుకోకుండా కష్టాల్లో చిక్కుకోవడం, వాటి నుండి ఎలా తప్పించుకున్నాడనే కథాంశంతో ‘శంకరాభరణం’ సినిమా సాగుతుందంటూ ‘కోన వెంకట్’ ఇది వరలోనే చెప్పారు. ఇందులో హీరోయిన్ అంజలి స్పెషల్ క్యారెక్టర్ చేసిందట..సర్దార్ గబ్బర్సింగ్ షూటింగ్లో బిజీగా ఉన్న పవన్ అక్కడే శంకరాభరణం టీజర్ను విడుదల చేశాడు.హీరో నిఖిల్ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో వ్యక్త పరిచాడు. పవన్ కళ్యాణ్ నన్ను హత్తుకున్నాడన్న సంతోషాన్ని వ్యక్తం చేయకుండా ఉండలేను. టీజర్ను చూసిన పవన్ కళ్యాణ్ టీజర్ బాగుందంటూ మెచ్చుకున్నాడని తెలిపాడు. చిత్ర నిర్మాత ప్రముఖ రచయిత కోన వెంకట్ సోషల్ మీడియాలో పవన్కి కృతజ్ఞతలు తెలిపాడు. తమ సినిమా శంకరాభరణం సినిమా టీజర్ను విడుదల చేసిన పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపాడు. టీజర్ లో నిఖిల్ బాడీ లాంగ్వేజ్ కొత్తగా కనిపిస్తోంది.
ట్రైలర్ ని బట్టి కొంత పార్ట్ బీహార్ బ్యాక్ డ్రాప్ లో నదుస్తుందని అర్థమౌతోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. ‘గీతాంజలి’ వంటి విజయం తర్వాత ఎంవీవీ సినిమా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ వారంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. దీపావళి పండుగ సందర్భంగా చిత్రం విడుదల కానుంది.ఈ విశయాన్నే సింబాలిక్ గా చెపుతూ “అబ్ ఆయేగా అస్లీ దీవాళి” అనే డైలాగ్ తో టీజర్ పూర్తయింది…