ఈ మధ్యే ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ లాంటి వరుస హిట్స్తో ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’తో మెప్పించిన దర్శకుడు మేర్లపాక గాంధీతో హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం “ఎక్స్ప్రెస్ రాజా “. ఈ చిత్రన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది .ఎక్స్ప్రెస్ రాజా అన్న క్యాచీ టైటిల్తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
ఇక దీపావళి కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇప్పటికే పోస్టర్తో అందరినీ విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఈ తాజా టీజర్తో మరింతగా కట్టిపడేసింది.ఇక ఓ రోడ్ జర్నీ నేపథ్యంలో, డిఫరెంట్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన సురభి హీరోయిన్గా నటించారు. వరుస హిట్స్తో జోరు మీదున్న యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. నిజానికి టీజర్ కు ఎక్కువ..ట్రయిలర్ కు తక్కువ అన్నట్లుంది నిడివి. పడిన మూడు డైలాగులు పేలిపోయాయి.” ఎవర్రా బాబూ..అందానికి ఆధార్ కార్డులా వుంది—ఒక్క సీన్ లోనూ హీరోయిజం చూపించనివ్వరా—పేరేంటీ అని అడిగితే చెప్పను అని బదులిస్తే..కనీసం జెండర్ అయినా చెప్పండి..మేలా ఫిమేలా “..అన్న డైలాగులు బాగానే పేలాయి. శర్వానంద్ తనదైన కామెడీ టైమింగ్తో రన్ రాజా రన్ ఫీల్ను తిరిగి పట్టుకొచ్చారు. మేర్లపాక గాంధీ మంచి యూత్ఫుల్ సన్నివేశాలతో సినిమాను మంచి ఎంటర్టైనర్గా రూపొందించారన్న విషయాన్ని టీజర్ స్పష్టం చేస్తోంది.
శర్వానంద్ రన్ రాజా రన్ అంత అందంగా కాకున్నా బాగానేవున్నాడు. సురభి లుక్ స్టయిలిష్ గా వుంది. మొత్తానికి సినిమా జోనర్ ఎలా వుంటుదో అన్నది కన్వే చేయగలిగారు. ఇటు లవ్ అండ్ రొమాంటిక్..అటు రన్..రన్..రన్..అనేలా కనిపిస్తోంది. మేర్లపాక గంధి హిట్ అయిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లోంచి ఎక్స్ ప్రెస్ ను, శర్వానంద్ కు, నిర్మాతలకు హిట్ అయిన రన్ రాజా రన్ లోంచి రాజాను తెచ్చుకుని “ఎక్స్ప్రెస్ రాజా ” ఈ కొత్త టైటిల్ పుట్టించారు.