అమ్మ పరీక్షలో నెగ్గి జీవితంలో నిలబడటానికి పరిక్ష రాసింది ఆ తల్లి. రాత్రి అనక పగలు అనక కష్టపడి చదివింది పరీక్ష రాసెందుకు సిద్దం అయ్యింది, అంతే…. ఇంతలో . నీకు బిడ్డ కావాలా లేక పరీక్ష కావలా అన్నాట్టు. నవమాసాలు మోసిన తన పుట్టబోయే బిడ్డ ద్వారా ఆ భగవంతుండు చిన్న పరీక్ష పెట్టాడు. ఇంతలో ఆసుపత్రికి తీసుకెళ్లారు పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఒక పరీక్ష రాసింది. ఇక రెండవ పరీక్ష రాయలంటే చాలా కష్టం ఎందుకంటే బాలింతగా ఉంటే కాలు తీసి కాలు పెటేందుకే ఓపిక ఉండదు కానీ ఆ తల్లి జీవితంలో గెలువాలి అంటే కచ్చితంగా ఈ పరీక్ష రాసి తీరాలి అనుకోని డాక్టర్ సహాయం తీసుకోని పరీక్ష విజయవంతంగా రాసి ఒకే రోజు రెండు పరిక్షలు రాసి జీవితం అనే పరిక్షలో నెగ్గింది.
ఇంతకు ఇది ఎక్కడ జరిగిందనేగా … మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్ మండలానికి చెందిన కవిత టెట్ పరీక్ష రాసేందుకు గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకుంది. అప్పటికే నెలలు నిండటంతో ఆమెకు ఉన్నట్టుండి పురుటినొప్పులు వచ్చాయి. 108 వాహనంలో వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసింది. తను చాలాకాలంగా టెట్ కు ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పింది కవిత. అంతేకాదు తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టమని వెల్లడించింది.