తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై నియామకాలకు ప్రభుత్వం తుది ఎగ్జామ్ తేదీని ఖరారు చేసింది. నవంబర్ నెలలో 19, 20 వ తేదీలలో సివిల్ ఎస్సై అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే అదే నెలలో 19, 20, 27 తేదీలలో కమ్యూనికేషన్ ఎస్సై అభ్యర్థులకు రాత పరీక్షా నిర్వహించనున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు వారం ముందు నుండే ఆన్ లైన్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్ఎఫ్వోలతోపాటు కమ్యూనికేషన్, పీటీవో కేటగిరీల్లో ఎస్ఐ పోస్టులకు ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పటికే ముందుగా అర్హత పరీక్షా నిర్వహించి అందులో సెలక్ట్ అయిన వారికి పరుగు పందెం, శారీరక పరీక్షలు నిర్వహించి అందులో నెగ్గినవారికి తుది పరీక్ష రాయడానికి ఎంపిక చేశారు.