అమెరికాలోని మిచిగాన్ లో జరిగిన ఒక దురదృష్ట సంఘటణలో గుంటూరుకి చెందిన తండ్రి, కొడుకులు మృతి చెందారు. గుంటూరుకు చెందిన 31 ఏళ్ళ నాగరాజు సురేపల్లి ఉద్యోగరిత్యా అమెరికాలో ఉంటున్నారు. మంగళవారం రోజు తను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోని స్విమ్మింగ్ పూల్ వద్దకు తన 3 ఏళ్ళ కుమారుడు అనంత్ ని ఆడించడానికి తీసుకెళ్ళాడు రాజు. ప్రమాదావశాత్తు అనంత్ స్విమ్మింగ్ పూల్ లో పడిపోవడంతో నాగరాజు కొడుకుని రక్షించేందుకు నీళ్ళలోకి దూకాడు. కాని అతనికి ఈత రాకపోవడంతో ఆ స్విమ్మింగ్ పూల్ లోనే మునిగిపోయాడు. చుట్టుపక్కల కాపాడేవారు ఎవరు లేకపోవడంతో తండ్రి, కొడుకులు ఇద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. నీటిలో తేలియాడుతున్న వారి శవాలను చూసి ఇతరులు పోలీసులకు సమాచారమిచ్చారు.
చనిపోయిన నాగరాజు స్వస్థలం గుంటూరు. ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఉద్యోగ నిమిత్తం కుటుంబంతో కలిసి అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఈ తండ్రి కొడుకులు మృతిచెందడంతో వారి ఇంట్లో విషాద చాయాలు అలుముకున్నాయి. కేవలం ఈత రాకపోవడం వలనే వీరు మృతి చెందినట్లు అమెరికా పోలీసులు నిర్దారించారు. నాగరాజు మునిగి పోయిన స్విమ్మింగ్ పూల్ లోతు 5 అడుగులే ఉండటం గమనార్హం.