మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాటన్నింటికీ సర్వరోగ నివారణి ఆయుర్వేదంలో ఒకటి ఉంది. దీనిని మీరే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయటం చాలా సులభం. చాలా తక్కువ వ్యయంతో కూడుకున్న పని. ఇది పూర్తిగా ఆయుర్వేదమే కాబట్టి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీని వలన ఉండవు. ఈ మిశ్రమాన్ని ఎలా తయారుచేఉకోవాలంటే…
కావాల్సినవి పదార్ధాలు:
తయారు చేయు విధానము: మొదటగా పైన తెలిపిన మూడు పదార్దాలను శుభ్రం చేసుకోవాలి. వీటిని వేరువేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయండి. మెంతులు, వాము, నల్ల జీలకర్రలని కలిపి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఎలా వాడాలంటే…
ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్ళలో 1 చెంచాడు చూర్ణం(పొడి)ని కలిపి తాగాలి. వేడి నీళ్ళలో మాత్రమే ఈ పొడిని వేసుకుని తాగాలి. ఈ చూర్ణం తాగిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోరాదు. అన్ని వయసుల వారు స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఈ చూర్ణంని తాగవచ్చు. ప్రతి రోజు ఈ చూర్ణంని సేవించడం వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వచ్చేస్తాయి. 80 – 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమ ఫలితాలు రావడాన్ని మీరు గమనించగలరు. అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. రక్తం శుభ్రపడుతుంది, మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది. శరీరంపై ఉన్నముడతలు తగ్గుతాయి. శరీరం బలంగా, చురుకుగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. రెండు లేక 3 నెలల తరువాత ఈ ఫలితాలను మీరే గుర్తిస్తారు.
దీనివల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు:
గమనిక: ఒకవేళ నిరాటంకంగా 3 నెలలు ఈ చూర్ణం తీసుకుంటే, 15 -20 రోజులు ఆపి, ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు.