గత కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మరణిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి, ప్రముఖ రచయిత సత్యమూర్తి, మరో రచయిత శ్రీనివాస్ చక్రవర్తి, అనూప్ రూబెన్స్ తల్లి, నాటకరంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములు, విలక్షణ నటుడు, హీరో రంగనాథ్, నృత్యదర్శకుడు భరత్ కన్నుమూశారు.
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కాశీ విశ్వనాథ్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళుతోన్న రైలులో ప్రయాణిస్తోన్న ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో ఖమ్మం జిల్లా సమీపంలో రైలులోనే మరణించారు. వెంటనే విశ్వనాథ్ ను భౌతికకాయాన్ని రైల్వే అధికారులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాదాపు ఆయన 70 చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. దాసరి నారాయణరావు, విజయబాపినీడు, రేలింగి నరసింహరావు, రాజా చంద్ర వంటి పలు ప్రముఖ దర్శకుల చిత్రాలకు కాశీ విశ్వనాథ్ పనిచేశారు. విశ్వనాథ్ మృతిపట్ల సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.