తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయభేరి మోగించింది. భారీ మెజారిటీతో తమకు తిరుగులేదని చాటింది. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. 2014 ఎన్నికల్లో కంటే అత్యధిక స్థానాలను గెలుచుకుంది టీఆరెస్. కాగా ఇదే ఎన్నికల్లో మరో ఘనత చోటు చేసుకుంది. ఐదుగురు అభ్యర్థులు వరుసగా ఆరుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. ఆ అయిదుగురు ఎవరో ఇప్పుడు మనం చూద్దాము.
సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీష్రావు, పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు, హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్, బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వరుసగా ఆరుసార్లు గెలిచారు. పైగా వీరంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం విశేషం.
ఇది ఇలా ఉండగా నలుగురు మంత్రులు ఓటమి ఎదురుకున్నారు. తుమ్మల, జూపల్లి, మహేందర్రెడ్డి, చందూలాల్ ఈ ఎన్నికలో ఓడి పోయారు. వీరితో పాటు శాసన సభాపతి సిరికొండ మధుసూధనాచారి సైతం ఓడిపోయారు.