Home / Entertainment / ఉత్తేజ్ కూతురు ‘షీ’ మొదలైంది

ఉత్తేజ్ కూతురు ‘షీ’ మొదలైంది

Author:

she2

ప్రముఖ నటుడు, రచయిత అయినటువంటి ఉత్తేజ్ కు సినిమా ఇండస్ట్రీలో ఓ మంచి గుర్తింపు వున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన నటనతోనే కాకుండా పలు సినిమాలకు మాటలు, కథలు రాసి, మంచి పేరు తెచ్చుకున్నాడు ఉత్తేజ్. ఈ మధ్య వరుస సినిమాలు చేయకపోయినా కూడా చేస్తున్న సినిమాలలో మాత్రం మంచి పాత్రలు చేస్తూ, అందరిని అలరిస్తున్నారు. అంతేకాకుండా తన నవలలతో అందరినీ తన అభిమానులుగా మార్చేసుకుంటున్నాడు.

ఉత్తేజ్ తన కూతురుని దర్శకుడు కృష్ణవంశీ సినిమా ద్వారానే హీరోయిన్ గా పరిచయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కాని అందరి అంచనాలు తలక్రిందులు చేస్తు ఒక నూతన దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో సినిమా తెరకు పరిచయం చేస్తున్నారు. టాలీవుడ్లో సాధారణంగా పలువురు సెలబ్రిటీల కుమారులే తప్ప కూతుర్లు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఉత్తేజ్ మాత్రం ఇందుకు భిన్నంగా హీరోయిన్ కావాలనుకున్న తన కూతురు చేతన ను చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు.

she1

చేతన హీరోహిన్గా నటిస్తున్న మొదటి చిత్రం ‘షీ’ఆదివారం హైదరబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమా లో శ్వేతా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. మహత్ రాఘవేంద్ర కథానాయకుడు. పర్స రమేష్ మహేంద్ర దర్శకుడు. కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు నిర్మిస్తున్నారు. పూజ కార్యక్రమం అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తేజేశ్వర్ రావు సోదరి రమ్య క్లాప్ నివ్వగా, అనూప్ సింగ్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు పూరి జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఒక అందమైన ప్రేమకథకు హారర్ ఎలిమెంట్స్‌ను జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇదొక మంచి చిత్రం. హారర్, లవ్, రొమాన్స్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ వుంటాయి. జనవరి 4 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఫిబ్రవరి, మార్చి నెలల్లో చిత్రాన్ని పూర్తి చేసి ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. మంచి టీమ్ కుదిరింది అని తెలిపారు. మరి మన తెలుగమ్మాయి హీరోయిన్‌గా సక్సెస్ కావాలని ఆకాంక్షిద్దాం.

(Visited 1,073 times, 1 visits today)