Home / Entertainment / క్రేజీ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న వరుణ్ తేజ్.

క్రేజీ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న వరుణ్ తేజ్.

Author:

varun1

మెగా ఫ్యామిలీ నుంచి పరిచయమైనప్పటికీ మాస్ ఇమేజ్ కోసం కాకుండా తనకంటూ సోంత స్టైల్ ని క్రీయెట్ చేసుకోని యాక్టర్ గా దూసుకుపోతున్నడు వరున తేజ్. తను మొదటి నుండి డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. తన మొదటి సినిమా ముకుందలో తన నటన తొ అందరిని ఆకట్టుకుని,రెండవ సినిమాగా కంచె యాక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టీంది. ఇప్పుడు మాస్ హీరోగా చేసిన సినిమా ‘లోఫర్’. పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అంటే ఎవరికీ భయపడడు, ఎంతమంది ఉన్నా సరే లెక్కచేయడు. పదునెక్కిన సంభాషణలతో చురకత్తిలా దూసుకెళ్తుంటాడు. పూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ మళ్ళీ మాస్ సినిమాలే చేయకుండా క్రేజీ కాంబినేషన్ లో డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు.

మాకు అందిన సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ వరుసగా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టి వరుసగా సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. అవేమిటంటే.. కంచె తర్వాత క్రిష్ డైరెక్షన్ లో రాయబారి అనె ఓ సినిమా కథ సిద్దమవుతోంది, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ స్పోర్ట్స్ డ్రామా కథ. ఇక దిల్ రాజు సంస్థలో రైటర్ గా పనిచేస్తున్న హరి అనే కొత్త డైరెక్టర్ తో చేయనున్న ‘ఫీల్ మై లవ్’ సినిమా వర్క్ కూడా జరుగుతోంది. ఇవి మూడు కాకుండా దేవకట్టా డైరెక్షన్ లో ఓ కథ చర్చల దశలో ఉందని వినికిడి. ఇలా వరుణ్ తేజ్ వరుసగా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టారు. తేజ తన దగ్గరికి వచ్చిన కథల్లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

(Visited 95 times, 1 visits today)